19-07-2025 02:11:23 AM
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): తెలంగాణలో అధికారంలో నే ఉన్నామన్న భ్రమలో కేటీఆర్ ఉన్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చురకలంటించారు. శుక్రవారం ఆయన సీఎల్పీలో విలేకరులతో మా ట్లాడారు. రాష్ట్ర ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని చాచి కొట్టి ఫామ్ హౌస్కు పరిమితం చేశారని.. రాష్ర్టం లో గుర్రం ఎవరో, గాడిద ఎవరో అందరికి తెలుసన్నారు. కేటీఆర్ కుం టి గుర్రం కావడంతో రేసుగుర్రమైన రేవంత్ రెడ్డిని ఆపాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు.
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సా మేల్ మాట్లాడుతూ.. తిరుమలగిరిలో సీఎం బహిరంగసభ విజయ వంతమైందన్నారు. కేటీఆర్ ని లీడర్ అని ప్రజలు నమ్మడం లేదని విమర్శించారు. చంద్రబాబుకు నీళ్లు, రా హుల్ గాంధీకి మూటలు అని కేటీఆర్ ఆరోపించడం విడ్డూరంగా ఉం దని టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జెల కాంతం మండిపడ్డారు.