2 July, 2026 | 3:58 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

లోక్‌అదాలత్‌లో 9.87 లక్షల కేసులు పరిష్కారం

29-09-2024 02:43 AM

హైకోర్టులో 231 కేసులు

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శనివారం జరిగిన లోక్‌అదాలత్‌తో 9.87 లక్షల కేసులు పరిష్కారమయ్యాయి. పెండింగ్ కేసులు 5.43 లక్షలు, ప్రాథమిక దశలోనివి 4.44 లక్షలు చొప్పున కేసులు ఉన్నాయి. కక్షిదారులకు రూ.2.22 కోట్లు పరిహారాన్ని ప్రకటించినట్టు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ పరిపాలనాధికారి జీ కళార్చన తెలిపారు.

కాగా, హైకోర్టులో నిర్వహించిన లోక్‌అదాలత్‌లతో 231 కేసులు పరిష్కారం అయ్యాయి. ఇందులో మోటా రు వాహన చట్టం కింద కేసులు 140, కార్మికుల పరిహారం వివాదానికి సంబంధించిన 28 కేసులున్నాయి. రూ.16.40 కోట్ల పరిహారాన్ని ప్రకటించడం ద్వారా 1,200 మంది లబ్ధి పొందారని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎం శాంతివర్ధని చెప్పారు.

బీమా పరివారానికి సంబంధించిన మూడు కేసుల్లో రూ.2.95 కోట్లు పరిహారం ప్రకటించినట్టు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జే అనిల్‌కుమార్, మాజీ న్యాయమూర్తి జస్టిస్ జీ శ్రీదేవి కేసులను విచారించారు.