15 April, 2026 | 12:39 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కాకతీయ నగర్ రామాలయంలో లక్ష దీపోత్సవం ఘనంగా

18-11-2025 06:15 PM

కార్తీక మాసం సోమవారం సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిట 

రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలో ఉన్న కాకతీయ నగర్ శ్రీ రామాలయం వద్ద సోమవారం లక్ష దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శ్రీ మాధవానంద స్వామి ఆశీస్సులతో నిర్వహించిన ఈ లక్ష దీపోత్సవంలో భక్తులు దీపాలను వెలిగించి క్షేమసమృద్ధులు కోరి ప్రార్థనలు చేశారు. వేలాది దీపాల కాంతులతో ఆలయం స్వర్ణ కాంతులు విరజిమ్ముతూ దగదగలా వెలుగులు విరజిమ్మింది. ఆలయ కమిటీ సభ్యులు, వేదపండితులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్తీక మాసంలో దీపదానం మహాపుణ్యకరమని పండితులు పేర్కొన్నారు.