30-07-2025 01:27:57 AM
జగిత్యాల అర్బన్, జూలై 29: జగిత్యాల జిల్లా కేంద్రంలో విచిత్రమైన ఘ టన వెలుగుచూసింది. భార్య, ఇద్దరు పిల్లలను వదిలేసిన వ్యక్తి ఓ ట్రాన్స్జెండర్తో సహజీవనం చేస్తున్న సంఘటన వెలుగు చూసింది. జగిత్యాల పట్టణానికి చెందిన బింగి రాజశేఖర్కు, పెంబట్ల గ్రామానికి చెందిన లాస్యతో 2014లో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్కు చెందిన ట్రాన్స్జెండర్ దీపుతో రాజశేఖర్ సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నాడు.
ఈ నేపథ్యంలో భార్య లాస్యను, పిల్లలను వదిలి దీపుతో జగిత్యాలలో సహజీవనం ప్రారంభించాడు. ఈ విషయం తెలిసిన లాస్య మానసికంగా తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. అయితే లాస్య చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ఉందని తెలిసినప్పటికీ భార్యను చూడడానికి రాజశేఖర్ హాస్పిటల్కు వెళ్లలేదు.
ఆందోళనకు గురైన అత్తమామలు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. తన ఇంట్లోనే ట్రాన్స్జెండర్ దీపుతో ఉన్న రాజశేఖర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గదికి తాళం వేసి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు రాజశేఖర్, దీపులను స్టేషన్కు తరలించి విచారణ ప్రారంభించారు.