05-06-2025 12:29:59 AM
కృష్ణ, జూన్ 4. బార్డర్ చెక్పోస్ట్ వద్ద కర్ణాటక నుండి తెలంగాణకు గోవులను అక్రమం గా తరలిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని బుధవారం ఎస్త్స్ర ఎస్ఎం నవీద్ అన్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా నారాయణపేట జిల్లా సరిహద్దు బార్డర్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని వాహనాల నెంబర్లను రిజిస్టర్లో నమోదు చేసుకోవాలని చెక్ పోస్ట్ వద్ద అప్రమత్తంగా ఉంటూ పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఎవరై నా పశువులను తరలిస్తే వాటికి సంబంధించిన వెటర్నరీ డాక్టర్ ఆమోదించిన పత్రాల ను కలిగి ఉండాలని లేనియెడల వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.