03-08-2025 12:29:16 AM
సీసీ కెమెరాకు చిక్కిన కంచుమల్ వద్ద రోడ్డు దాటిన దృశ్యాలు
కామారెడ్డి, ఆగస్టు 2 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో చిరుతల సంచారంతో స్థానికులను భయాందోళన గురిచేస్తున్నా యి. శనివారం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కంచుమల్ గ్రామం వద్ద రోడ్డు దాటుతున్న చిరుత దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయింది. రోడ్డు దాటుతున్న చిరుతను చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు చిరుత సంచారాన్ని గుర్తించి బోను ఏర్పాటుచేసి పట్టుకోవాలని కోరుతున్నారు.