24-04-2025 02:15:44 AM
రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్
ఉగ్రదాడి చేసిన వారిని ఊరికే వదిలిపెట్టం. కేవలం దాడి చేసిన వారిని మాత్రమే కాదు దాడి వెనుక ఉన్న సూత్రదారులను కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి కేంద్రం అండగా ఉంటుంది. ఇదో పిరికిపంద చర్య. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో మేమంతా ఐక్యంగా ఉన్నాం. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠితో మంత్రి చర్చలు జరిపారు.