30-05-2025 12:19:11 AM
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు పిలుపు
నమోదు కొరకు ప్రచార జాతా ప్రారంభం
భద్రాచలం, మే 29 (విజయ క్రాంతి)తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల ల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాల ని, ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని టి ఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు పి లుపునిచ్చారు. గురువారం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు పెంపుదల కొరకు టీఎస్ యుటిఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రచార జాతాను అంబెడ్కర్ సెంటర్ భద్రాచలం నందు సీనియర్ నాయకులు పి లక్ష్మీ నారాయణ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జాతాను ఉద్దేశించి రాష్ట్ర కా ర్యదర్శి బి.రాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉ న్నారని, విశాలమైన తరగతి గదులు , ఆటస్థ లం ఉన్నాయని తల్లిదండ్రులందరూ త మ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను ఉచితంగా పొందాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ బడులను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉన్నదని తె లియజేశారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు,నోటు పుస్తకాలు, వర్క్ బుక్కులు, ఏకరూప దుస్తులు ఉచితంగా అం దించబడుతున్నాయని, నాణ్యమైన మధ్యా హ్న భోజనం, వారానికి మూడు సార్లు కోడిగుడ్లు, రాగిజావ అందిస్తున్నారని తల్లిదండ్రు లు ప్రభుత్వ పాఠశాలలను ఆదరించి పిల్లలను చేర్పించి, ఫీజుల భారం లేని ఉచిత వి ద్య పొందాలని, విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రభుత్వ పాఠశాలలు దోహదపడుతా యని తెలియజేశారు.
గుడి, మసీదు,చర్చిల నిర్మాణం కోసం ఐకమత్యంగా కదిలే ప్రజ లు ఊరి బడి కోసం కూడా ఏకమై బడిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేశారు.గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని టీఎస్ యుటిఎఫ్ శ్రేణులు ఈరోజు నుండి జూన్ 5 వరకు ప్రచారం నిర్వహిస్తాయని తెలియజేశారు.
ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన, ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారని, అత్యున్నత విద్యార్హతలు కలిగిన టీచర్లు ఉంటారని తల్లిదండ్రులకు వివరిస్తామని తెలియజేశారు. తల్లిదండ్రుల ఆశను ప్రైవేటు విద్యా వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని,చదువుల నాణ్యతలో ప్రభు త్వ, ప్రైవేటు పాఠశాలల మధ్య పెద్దగా వ్య త్యాసం లేదని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయని,
సంపాదనలో సగానికి పైగా పిల్లల చ దువుల కోసమే ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని, ప్రభుత్వ బడి మూతపడితే స మాజానికి నష్టం అని, మన ఊరు - మనబ డి, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా మౌళిక వసతుల కల్పన మెరుగైందని తెలియజేశారు.ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, ఏఐ ఆధారిత బోధన, డిజిటల్ తరగతి గదులు, లైబ్ర రీ, లేబరేటరీలతో పాటు ఆటపాటలతో అ హ్లాదకరమైన వాతావరణంలో, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధతో, నిపుణులైన ఉపాధ్యాయులతో ఒత్తిడి లేని చదువు అందించబడు తుందని,
పిల్లల మానసిక ఆరోగ్యానికి, వ్యక్తి త్వ వికాసానికి అనువుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయని, మన పిల్ల లను మన ఊరి బడిలోనే చేర్పించి బడికి అ వసరమైన వసతుల కల్పనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే తప్పనిసరిగా బడి నిలబడుతుందని తెలియజేశారు. పిల్లలకు నాణ్యమైన వి ద్య ఉచితంగా అందుతుంది. తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గుతుంది.
కనుక తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని బి. రాజు పిలుపునిచ్చారు. పట్టణం లో ని అంబెడ్కర్ సెంటర్,బస్టాండ్ రోడ్,తాత గు డి సెంటర్,ప్రభుత్వ జూనియర్ కాలేజ్ , పాత మార్కెట్ , ఐటీడీఏ రోడ్ జగదీష్ కాల నీ, ఎంపీ కాలనీ, కెసిఆర్ కాలనీ ఏరియాల లో తొలిరోజు ప్రచారం నిర్వహించారు.
ఈ ప్రచార జాతాలో సంఘం జిల్లా అధ్యక్షులు బి.మురళీమోహన్ , ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎన్.కృష్ణ, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు ఎస్.వెంకటేశ్వర్లు,జిల్లా కార్యదర్శులు డి.తావుర్య, ఎస్.శైలజ, ఎస్. విజయ కుమార్,ఎం.సత్య నారాయణ, టీవీఎస్ ప్రసాద్, చిన్నక్క భద్రాచలం,బూర్గంపాడు, దుమ్ముగూడెం ఇల్లందు మండల భాద్యులు ఏ.వెంకటేశ్వర్లు , బి .రమేష్ ,ఆంగోత్ రాంబా బు,రమేష్ చంద్ ,వి రాంబాబు,రాజా శ్రీనివాస్ , మహిళా నాయకులు ఇర్పా అనసూ య, నాగమణి , కార్యకర్తలు శ్యాంసుందర్ , శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.