31-05-2025 12:50:10 AM
రాజాపూర్ మే 30: మన ఊరు పిల్లలను.. మన ఊరి ప్రభుత్వ పాఠశాలలోనే చ దివించాలని టీఎస్ యూ టి ఎఫ్ జిల్లా అ ధ్యక్షుడు ఆర్ నర్సింహులు అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యా య ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాజాపూర్ మండల పరిధిలోని వివిధ గ్రా మాలలో బడిబాట ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని కోరా రు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఉన్నత విద్యా అర్హతలు కలిగి ఉ న్నారని అనుభవంతో బోధిస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడి యం తో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఉందని ,విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు రెండు జతల బట్ట లు,నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తుందన్నారు. కంప్యూటర్ శిక్షణ తోపాటు క్రీడలు, పాటలు,యోగ నేర్పి మానసికంగా, శారీరకంగా దృడంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి, శ్రీనివాస్, జిల్లా నాయకులు హన్మంతు నా యక్, రాజపూర్ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి హన్మప్ప, నాగయ్య మం డల నాయకులు, వెంకటయ్య ,రమేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.