31-05-2025 12:50:42 AM
జగిత్యాల అర్బన్, మే 30 (విజయక్రాంతి): ఓ మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖై దుతో పాటూ రూ. 2 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం జగిత్యాల అదనపు న్యాయమూర్తి ర త్న ప్రభావతి తీర్పునిచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్లికార్జున్ కథనం ప్రకారం గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంగలాపూర్ గ్రామ శివారులో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించగా, పోలీసులు గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి ద ర్యాప్తు ప్రారంభించారు.
ధర్మపురి సిఐ లక్ష్మీబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ దొరికిన ఒక పర్సులోని పాన్ బ్రోకెర్ అడ్రస్ ద్వారా దర్యాప్తు ప్రారంభించి, ఆ మహిళ హైద రా బాదుకు చెందిన మంద స్వప్న (29)గా గుర్తించారు. కూలి పని చేస్తు జీవించే ఆమెను భర్త విడిచి పెట్టినట్లు తెలిసింది. 2018 అక్టోబర్ 19న రాత్రి జగిత్యాల మండలం లక్ష్మిపూర్ గ్రామానికి తను ప్రేమించిన నక్క వంశీ పెళ్లి చేసుకుందాం రమ్మంటున్నాడని స్వప్న కాలనీ వాళ్ళకు చె ప్పి వెళ్లింది.
డబ్బులు లేకుంటే వెండి వస్తువుని పాన్ బ్రోకెర్ వద్ద తాకట్టు పెట్టినట్లు కాలనీ వాసు లు ఇచ్చిన క్లూతో నిందితుడు నక్క వంశీని అరెస్ట్ చేసి రిమాండుకు పంపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్లికార్జున్ వాదనలు విని, సాక్షులను విచారించిన జడ్జి తీర్పునిచ్చినట్లు పిపి తెలిపారు.
ఈ కేసులో పకడ్బందీగా విచారణ జరిపి, సాక్ష్యులను కొర్టులో ప్రవేశ పెట్టి, శిక్ష పడటానిక కృషిచేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ మలికార్జున్, ధర్మపురి సిఐ లక్ష్మీబాబు, కోర్టు లైజనింగ్ ఆఫీసర్స్ ఎస్ఐ శ్రీకాంత్, కిరణ్ కుమార్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ శ్రీధర్’లను ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.