28-06-2025 12:17:23 AM
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి
సూర్యాపేట,(విజయక్రాంతి): లయన్స్ క్లబ్ లు తమ సేవలను విస్తరించాలని సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. సూర్యాపేట లయన్స్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో శుక్రవారం ఆయన ముఖ్యఅతిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని వాటి అభివృద్దికి సహాయం చేయాలని అన్నారు. సూర్యాపేట లయన్స్ క్లబ్ నందు సభ్యుల సంఖ్యను పెంచుకోవాలని అన్నారు.
తదుపరీ లయన్ దారా క్ర్రష్ణారావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సంస్ధలు ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని, సూర్యాపేట లో లయన్స్ కంటి ఆసుపత్రి ద్వారా తక్కువ ధరలో కంటి ఆపరేషన్ లు నిర్వహిస్తూ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిందని అన్నారు. అనంతరం లయన్స్ క్లబ్ సూర్యాపేట నూతన అధ్యక్షులుగా మిర్యాల సుధాకర్, కార్యదర్శి గా గుండా లక్ష్మయ్య, కోశాధికారి గా పాశం అనంతరావు , వైస్ ప్రెసిడెంట్ లుగా ఈగ దయాకర్ గుప్త, యర్రంశెట్టి ఉపేందర్, జాయింట్ సెక్రటరీ గా చెరకు క్ర్రష్ణ గౌడ్, జెడ్ సి గా కె. లక్ష్మారెడ్డి, ఐ డొనేషన్ కమిటీ సభ్యులు గా వెంపటి శబరినాధ్, మీలా వంశిలు ప్రమాణ స్వీకారం చేశారు.