29 March, 2026 | 12:17 AM

పశువులకు గాలికుంటు నివారణ టీకాలు

28-03-2026 10:44 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండల పరిధిలోని తాళ్ల వెళ్ళాంల గ్రామంలో శనివారం పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని నిర్వహించారు. పశుగ్రాస రక్షణ మరియు పశువుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పశువులకు టీకాలు వేశారు. ఒకే రోజు మొత్తం 57 గేదెలు, 47 ఆవులకు పశువైద్య సిబ్బంది టీకాలు వేశారు.

ఈ సందర్భంగా పశువైద్యాధికారి డాక్టర్ అమరేందర్ మాట్లాడుతూ పశువులకు సోకే ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధిని నివారించేందుకు ప్రతి రైతు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని కోరారు. పశువుల ఆరోగ్యం పై రైతుల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జోగు సురేష్, ఉప సర్పంచ్ పామునుగుల్ల సునీత బుచ్చి రాములు, పాల సంఘం చైర్మన్ బత్తుల ప్రవీణ్ కుమార్ పాల్గొని ప్రారంభించారు.