02-05-2025 10:46:39 PM
అప్పు ఎగ్గొట్టేందుకు రుణదాత హత్య
48 గంటల్లోనే నరసనపల్లి మర్డర్ కేసు ఛేదించిన పోలీసులు
పాత నిరసుడి అరెస్టు
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని నరసనపల్లి గ్రామంలో గత నెల 30న జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు 42 గంటల్లోనే చేదించారు. శుక్రవారం కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. గత నెల 30న పోలీస్ స్టేషన్ పరిధిలోని నరసన్నపల్లి గ్రామ శివారులో వ్యవసాయ క్షేత్రం వద్ద చిదురు కవిత (44) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకు చీరతో ఉరివేసి హత్య చేశాడు. ఈనెల 01న ఆమె భర్త గంగారెడ్డి దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కామారెడ్డి అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి రూరల్ సీఐ రామన్ ,దేవనపల్లి ఎస్సై గూడెం రాజు ఆధ్వర్యంలో విచారణ లో భాగంగా సీసీ కెమెరాలు పరిశీలించారు. సాంకేతిక సహాయంతో దోమకొండ మండలం చింతమన్ పల్లి లో పల్లికి చెందిన జంగంపల్లి మహేష్ అనే పాత నేరస్తుడిని అదృప్లోకి తీసుకొని విచారించడంతో కవిత మర్డర్ కేసు కొలిక్కి వచ్చింది. జంగంపల్లి మహేష్ పై ఇదివరకు భిక్కనూర్ పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ కేసు ఉంది ఆ కేసులో బెయిల్ కొరకు చిదురు కవిత వద్ద మహేష్, రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. ఇటీవల కాలంలో అప్పు తిరిగి చెల్లించాలని కవిత ఒత్తిడి తేవడంతో ఆమె ను హత్య చేయాలని పథకం పన్నాడు. ఈనెల 30న కవిత వ్యవసాయ భూమి వద్దకు వస్తే డబ్బులు చెల్లిస్తానని నమ్మబలికాడు అక్కడికి వచ్చిన కవిత ముక్కుపై బలంగా చేతితో గుద్దడంతో ఆమె కింద పడిపోగానే చీర కొంగుతోనే ఉరిబిగించి ఊపిరాడకుండా హత్య చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు, సెల్ ఫోన్ ను తీసుకొని పరారయ్యాడు. జంగంపల్లి మహేష్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని కేసును చాకచక్యంగా పరిష్కరించిన పోలీస్ అధికారులు క్రైమ్ టీం సిబ్బందిని ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు.