calender_icon.png 24 June, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లు పెంచాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి

05-06-2025 12:14:48 AM

ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య

హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీసీ రిజర్వేష న్లను 42శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో జరిగిన 14 బీసీ సంఘాల సమావేశం లో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్లను పెంచకపోతే మాత్రం బీసీలు ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని పి లుపునిచ్చారు.

రిజర్వేషన్లను పెం చాలని డిమాండ్ చేస్తూ 14 సంఘా ల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు వెల్లడించారు. దా దాపు ఏడాది నుంచి స్థానిక సంస్థల ఎన్నికలను బీసీ రిజర్వేషన్ల పేరిట వాయిదా వేస్తూ వచ్చిన సర్కారు... రిజర్వేషన్లను పెంచకుండా ఎన్నికల కు పోతామంటే అంగీకరించబోమ ని స్పష్టం చేశారు.

అసెంబ్లీలో 42శా తం రిజర్వేషన్ల చట్టం చేసినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి జీవో జారీ కాలేదన్నారు. చట్టం చేసిన తర్వాత కేంద్రానికి పంపిస్తామని చెప్పినా ఇంతవరకు అతీగతీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల పెం పు అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి కేం ద్రంపై నెట్టేసి తప్పించుకునే ప్రయ త్నం చేస్తున్నారని విమర్శించారు.