calender_icon.png 3 June, 2025 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ స్టేట్ ర్యాంకర్ ను సన్మానించిన స్థానికులు..

30-04-2025 10:19:18 PM

కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం హనుమాన్ బస్తి నివాసి ప్రాణదార ట్రస్ట్ అధ్యక్షుడు సంతోష్, రేణుకల కుమార్తె సాత్విక వైరా బాలికల, ప్రభుత్వ గురుకుల కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతూ 440కి 436 మార్కులు సాధించడంతో బుధవారం బస్తీ పెద్దలు, స్థానికులు, సాత్వికను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్లు మాట్లాడుతూ... భవిష్యత్తులో అనుకున్న లక్ష్యాన్ని చేరే విధంగా శ్రమించి మంచి విజయాన్ని సాధించాలని భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను చేదించాలని, మానవసేవే మాధవసేవ అనే, తండ్రి బాటన కూతురు నడిచి సమాజానికి సేవా దృక్పథంతో సేవచేసి, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలన్నారు. హనుమాన్ బస్తి మాజీ కౌన్సిలర్లు, అంబుల వేణుగోపాల్, వాసా భారతి, సింగరేణి కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం, స్థానిక పెద్దలు దావూద్, సామంతుల నగేష్, సంగు శ్రీకాంత్, హఫీజ్, బసనబోయిన వెంకటేశ్వర్లు, షకీల్, అంబుల సుమన్, గట్టు వేణుగోపాల్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.