లక్ష్మీపూర్లో చోరీ..
24-08-2026 01:00 AM
తాళం పగలగొట్టి మూడు లక్షల రూపాయల విలువైన వస్తువుల అపహరణ
మానకొండూరు, జులై 23 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లక్ష్మీపూర్ గ్రామంలో రాపాక లక్ష్మణ్ కు చెందిన తాళం వేసిన ఇంట్లో శనివారం అర్ధరాత్రి తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి తులం బంగారం, మూడు తులాల వెండి, బ్యాండ్ వస్తువులు, డీజేకు సంబంధించిన వస్తువులు, రాగి, ఇత్తడి, వస్తువులు సుమారుగా 3 లక్షల విలువైన వస్తువులు అపహరణకు గురయ్యాయి. ఈ మేరకు బాధితుడు రాపాక లక్ష్మణ్ మానకొండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.






