మధుయాష్కీకి అస్వస్థత
17-09-2025 12:00 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ మంగళవారం సచివాలయానికి వెళ్లారు. మంత్రి శ్రీధర్బాబుతో భేటీ అయ్యేందుకు ఆయన చాంబర్కు వెళ్లి స్పృహ తప్పి పడిపోయారు. సహాయకులు ఆయనను గచ్చిబౌలి ఏఐసీ ఆస్పత్రికి తరలించారు. రక్తపోటు పెరగడంతోనే అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.






