05-12-2025 12:00:00 AM
పాపన్నపేట, డిసెంబర్ 4 :దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండ లం ఏడుపాయల వనదుర్గమ్మకు ప్రతి పౌర్ణమి రోజు నిర్వహించే పల్లకి సేవ కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం అట్టహా సంగా నిర్వహించారు.
ఆలయ అర్చకులు వన దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహా న్ని పల్లకిలో ఉంచి ఊరేగించారు. భక్తుల జ య జయ ద్వానాల మధ్య ఆలయ పరిసరా లు హోరెత్తాయి. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.