27-05-2025 05:08:48 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోని గంగోని కుంట, చిలక వాగు గుండ్ల చెరువు కబ్జాలపై ఇరిగేషన్ అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. సర్వే నెంబర్ 24 77 లో 12 ఎకరాల 16 గుంటలు ఉండవలసిన గంగోని కుంట శిఖం భూమి ఆరు ఎకరాలు కూడా లేదని ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు సమ్మయ్య అధికారులకు వివరించారు. ఇరిగేషన్ ఏఈలు సునీత, ప్రీతి లు మోకపై విచారణ జరిపి పై అధికారులకు నివేదిక ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ... సంబంధిత అధికారులు ఎవరికి వారు విచారణ జరిపి చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖల అధికారులు మోకపై ఒకేసారి సర్వే చేసి కబ్జాకు గురైన భూములను కాపాడాలని, కబ్జా చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.