2 July, 2026 | 10:51 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

మహేశ్వర్‌రెడ్డీ చిలుక జోష్యం చెప్పుకో..

17-05-2025 01:04 AM

ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ 

హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): బీజేపీఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి రాజకీయాలు వదిలేసి.. జ్యోతిష్యం చెప్పుకుంటే బాగుంటుందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. రాష్ట్రంలో  సీఎం మార్పు ఉంటుందని మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన ఖండించారు.

రెండు నెలలకోసారి మహేశ్వర్ రెడ్డి ఊకదంపుడు  సోది, ఊహకందని స్టోరీలు అల్లుతున్నాడని.. సీఎంపై ఈర్ష, ద్వేషంతోనే ఆయన తప్పుడు ప్రచా రం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏమి జరుగుతుందో మహేశ్వరెడ్డికి తెలియదని, ఆ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీలో ఉంటాడో లేదో తాను జ్యో ష్యం చూసి చెప్పాలని లక్ష్మణ్‌కుమార్ హిత వు పలికారు.

మహేశ్వర్‌రెడ్డికి జ్యోతిష్యంపై అంత పట్టుంటే తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి వస్తుందో చెప్పాలని సవాల్ విసిరారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం దాదా పు 12 మంది కత్తులు దూసుకుంటున్నారని, ఒకరి వెనక మరొకరు గోతులు తవ్వుకుం టూ అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇస్తే ఆయనకు గౌర వం ఉంటుందన్నారు.