calender_icon.png 24 August, 2025 | 4:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

24-08-2025 10:43:53 AM

హైదరాబాద్: శ్రీశైలం జలాశయా(Srisailam Reservoir)నికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఎగువ నుండి భారీగా వరద నీరు వస్తున్నందున అధికారులు నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 4,71,386 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 5,05,150 క్యూసెక్కులుగా నమోదైంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 21,775 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. అలాగే 10 స్పిల్‌వే గేట్లను 18 అడుగులు మేర ఎత్తి 4,18,060 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 881.50 అడుగులు ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 196.11 టీఎంసీలుగా ఉంది.