20 March, 2026 | 10:50 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

వక్ఫ్ సమస్యలపై ఢిల్లీకి మహేశ్వరం రైతులు

21-09-2024 02:19 AM

అధ్యయనం చేస్తామన్న వక్ఫ్ సవరణ జేపీసీ చైర్మన్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): వక్ఫ్ పేరిట తాము అన్యా యానికి గురయ్యామని తమను ఆదుకోవాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరానికి చెందిన బాధిత రైతులు ఢిల్లీ బాట పట్టారు. శుక్రవారం ఢిల్లీలో మహబూబ్ నగర్ ఎంపీ, వక్ఫ్ సవరణపై ఏర్పాటు చేసిన జేపీసీ సభ్యురాలు డీకే అరుణను కలిసి తమ సమస్యలను వివరించారు. తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. డీకే అరుణతో పాటు వెళ్లి వక్ఫ్ సవరణ జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) చైర్మన్ జగదాంబిక పాల్‌కు రైతులు వినతిపత్రం ఇచ్చారు. వక్ఫ్ బాధిత రైతుల వినతిపై చైర్మన్ సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఈ అంశంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.