15 April, 2026 | 1:16 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

రైతుల ఖాతాల్లో మక్కల పైసలు జమ

13-12-2025 01:04 AM
  1. 5 కోట్లు విడుదల చేసిన సర్కారు

‘విజయక్రాంతి’ కథనానికి స్పందన   

మహబూబాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): రైతుల ఖాతాల్లో మక్కల పైసలు జమయ్యాయి. శుక్రవారం రూ.౫ కోట్ల బకాయిలను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని, మిగిలిన బకాయిలు సోమవారం చెల్లిస్తామని మహబూబాబాద్ మార్క్‌ఫెడ్ డీఎం శ్యామ్ తెలిపారు. మార్క్‌ఫెడ్‌కు మక్కలు విక్రయించి నెల దాటినా అధికారులు రైతులకు డబ్బులు చెల్లించలేదు.

దీంతో యాసంగి పెట్టుబడులకు రైతులు పడుతున్న ఇబ్బందులపై ఈనెల 3న విజయక్రాంతి పత్రికలో మక్కల పైసల కోసం నిరీక్షణ పేరు తో కథనం ప్రచురించింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 700 మంది రైతుల నుంచి మొక్కజొన్నలు కొన్న మార్కెట్ సుమారు 8 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంది. రైతుల ఇబ్బందులను విజయక్రాంతి దినపత్రికలో ప్రచురించి ఈ అంశాన్ని రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో బకాయిల చెల్లింపులకు చర్యలు తీసుకున్నారు.