20 March, 2026 | 6:14 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

రాజ్ కుమార్ గోయల్ ప్రమాణ స్వీకారం

15-12-2025 12:29 PM

న్యూఢిల్లీ: మాజీ ఐఏఎస్ అధికారి రాజ్ కుమార్ గోయల్(Raj Kumar Goyal takes oath) సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) చేతుల మీదుగా ప్రధాన సమాచార కమిషనర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో నిరాడబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్ర సిబ్బంది శాఖ సహాయం మంత్రి జితేంద్ర సింగ్, తదితరులు హాజరయ్యారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్యానెల్ గత వారం గోయల్ పేరును సీఐసీగా సిఫార్సు చేసింది. గోయల్ అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం-కేంద్రపాలిత ప్రాంతాల (AGMUT) క్యాడర్‌కు చెందిన 1990 బ్యాచ్ (పదవీ విరమణ చేసిన) ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (Indian Administrative Service) అధికారి. ఆయన ఆగస్టు 31న కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖలోని న్యాయ విభాగం కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు.