16 April, 2026 | 12:02 PM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

పుస్తకావిష్కరణ సభను జయప్రదం చేయండి

16-11-2025 05:59 PM

నకిరేకల్ (విజయక్రాంతి): భారత విప్లవోద్యమ నిర్మాత, ప్రతిఘటన పోరాట రూపకర్త చండ్ర పుల్లారెడ్డి 41 వర్ధంతి సందర్భంగా ఆయన రాసిన కొన్ని ముఖ్య రచనలను పుస్తకంగా ముద్రించి ఈ నెల 19న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పుస్తక ఆవిష్కరణ సభ నిర్వహిస్తున్నట్లు న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి అంబటి చిరంజీవి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మెయిన్ సెంటర్ లో సిపి రెడ్డి సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

చండ్ర పుల్లారెడ్డి 41 వర్ధంతి సందర్భంగా ఆయన రాసిన ముఖ్య రచనలను న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ తెలుగు, ఇంగ్లీషు అనువాదలతో పుస్తకాలు రూపొందించిందని తెలిపారు. ఈ పుస్తకావిష్కరణ సభకు విప్లవ శ్రేణులు, సిపి అభిమానులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు-కూలీ సంఘం జిల్లా కోశాధికారి గజ్జి రవి, పి. వై.ఎల్ జిల్లా అధ్యక్షులు మామిడోజూ వెంకటేశ్వర్లు, ఏఐకేఎంఎస్ నాయకులు పుట్ట సత్యం, ఐ యఫ్ టీ యూ నాయకులు మామిడి ఎల్లయ్య, బి.యం.ఎస్ కన్వీనర్ చెడిపల్లి కాశీరాం, బీసీపీ జిల్లా నాయకులు బొల్లికొండ లింగయ్య, గుత్తా వెంకటరెడ్డి, గిరి వెంకన్న, మరయ్య, రాములు పాల్గొన్నారు.