18 April, 2026 | 3:56 PM

Breaking News

మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి   •   ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌... DA పెంపు   •   హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్‌ — ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్— ఇరాన్ సంచలన ప్రకటన   •   రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం   •   మహిళా బిల్లు వీగిపోవడం— బీజేపీ విధానాల ఓటమి   •   దేశ మహిళలకు అన్యాయం.. కాంగ్రెస్, బీజేపీ‎ల‎పై హరీశ్‎రావు కీలక వ్యాఖ్యలు   •   వర్క్ షాప్ కోసం అనుమతి ఇవ్వండి   •   కరీంనగర్ లో విజయక్రాంతి వార్షికోత్సవ వేడుకలు   •   రాఘవపేటలో బడిబాట కార్యక్రమం   •   దళిత క్రిస్టియన్స్ పై సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి   •  

ఉపాధి కూలీల కలెక్టరేట్ ధర్నా విజయవంతం చేయండి

23-05-2025 01:53 AM

బలరాం సీఐటీయూ జిల్లా కార్యదర్శి

నారాయణపేట. మే 22 (విజయక్రాంతి): జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేస్తున్న ఉపాధి కూలీల రెండు  నెలలు పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని రోజు కూలి 600 రూపాయలు పెంచి సంవత్సరంలో 200  పని దినాలు కల్పించాలని కోరుతూ ఈనెల 26న నారాయణపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా ఉంటుందని సిఐటియు జిల్లా కార్యదర్శి బల్ రామ్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన బుధవారం రోజు  నారాయణపేట  మండల పరిధిలోని సింగారం ,శేర్నపల్లి గ్రామాల శివార్లలో  పనిచేస్తున్న ఉపాధి పని ప్రదేశాలను సందర్శించి ఉపాధి కూలీలతో మాట్లాడారు.  పలు సమస్యలు కూలీలు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు.  ఉపాధి కూలీ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని అదేవిధంగా ఉపాధి బడుగు బలహీన వర్గాలకు ఉపాధి కల్పిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కు కేంద్ర బడ్జెట్లో 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉండగా కేవలం 86,000 కోట్ల రూపాయలే కేటాయించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు .

ఉపాధి కూలీలకు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని వేసవికాలంలో 50 శాతం అదనపు కూలి కలిపి ఇవ్వాలని తదితర డిమాండ్లతో జరుగుతున్న కలెక్టరేట్ ధర్నాను ఉపాధి కూలీలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు నరహరి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పవన్ కుమార్ కూలీలు పాల్గొన్నారు.