05-06-2025 01:20:47 AM
సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు భద్రాచలం డివిజన్ కార్యదర్శి కల్లూరి వెంకటేశ్వరరావు
చర్ల, జూన్ 4 (విజయక్రాంతి): సిపిఐ మండల మహాసభను జయప్రదం చేయాలని సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరు వెంకటేశ్వర రావు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో మండల కౌన్సిల్ సమావేశం నూప తిరుపతి రావు అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న మాట్లాడుతూ. జూన్ 10.వ తేదీన సిపిఐ 20వ మండల మహాసభ ను జయప్రదం చేయాలని, ఈ సభను విజయవంతం చేయడానికి అందరు బాధ్యత తీసుకోవాలన్నారు,. సిపిఐ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అనేక పోరాటాలు నిర్వహించి ఆ పోరాట ఫలితాలను పేద ప్రజలకు దక్కించిన చరిత్ర కలిగిన పార్టీ అని అన్నారు,
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) భారతదేశంలో ఆవిర్భవించి వంద సంవత్సరాలు అయిందని ఇప్పటివరకు దేశంలో ఏ పార్టీ వంద సంవత్సరాల చరిత్ర కలిగి పార్టీ లేదని ప్రజలలో మమేకమై ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజా ఉద్యమాలు నిర్వహించిన పార్టీ సిపిఐ పార్టీ అన్నారు. భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల అభివృద్ధి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరా టం నిర్వహించి 10 లక్షల ఎకరాల భూస్వాముల భూములను పేదలకు పంచి పెట్టిందన్నారు.
చర్ల మండలంలో అనేక గ్రామాలలో సిపిఐ పార్టీ పోరాట ఫలితంగా పేదలకు ఇండ్ల స్థలాలు పోడు భూములు దక్కాయని ,ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పోడు వివాదాలు కొనసాగుతున్నాయని వాటి పట్టాల కోసం పోరాటాలు నిర్వహిస్తున్నామని , సాగునీటి చెక్ డ్యాములు, రోడ్లు , వలస ఆదివాసుల కుల ధ్రువీకరణ పత్రాలు, పోడు పట్టాలు, వంటి మౌలిక సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించాలని, సమస్యల పరిష్కార సాధన కోసం మహాసభలో చర్చించేందుకే మండల మహాసభ జరుగుతుందన్నారు.
పార్టీ ప్రజా సంఘాలకు అభిమా నులకు ఈ సందర్భంగా ఆహ్వానం పలికారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు మండల కార్యదర్శి నూప.పోతయ్యా. పాలంచ రామారావు , చల్ల లక్ష్మీనారాయణ, ఉప్పులూరి నాగరాజు, కోడి రెక్కల రాజారావు, కోట శంకర్, పాలెం సత్యనారాయణ, మునిగిల రామారావు, మునిగల భద్రం, పూజారి రాము, మడివి దేవయ్య, ఎలకమ్ రామ య్య, సబ్కా ఎర్రయ్య, సోడి కన్నయ్య, కాకర్ల అన్న సూర్య, పయ్యావుల జయమ్మ, పోడియం ఆదిలక్ష్మి,పూజారి లక్ష్మి, మోట్ల ఆదిలక్ష్మి, నూప .రాము, కట్ట ముత్తయ్య సోడి జోగయ్య ,సూదుల నరసయ్య, కోటి ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.