calender_icon.png 19 June, 2025 | 6:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద భారీ ధర్నా

05-06-2025 01:22:28 AM

  1. ధర్నా శిబిరాన్ని సందర్శించిన మాజీ మంత్రి వనమా
  2. కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
  3. వనమ ఆధ్వర్యంలో డైరెక్టర్ (పా)కు వినతిపత్రం అందించిన నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 4 (విజయక్రాంతి): ప్రభుత్వ రంగ సంస్థ అయినా సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న స మస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టిబిజికే ఆధ్వర్యంలో బుధవారం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదురుగా ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మిరియా ల రాజిరెడ్డి, కాపు కృష్ణ, ఉపాధ్యక్షులు కూసెను వీరభద్రయ్య ల సమక్షంలో ధర్నా నిర్వహించారు.

టీబీజీకేఎస్ ముసలివారి పోరాటాలలో భాగంగా హెడ్ ఆఫీస్ వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వనమా  వెంకటేశ్వరరావు  సింగరేణి సంస్థలో మెడికల్ రిఫరల్ విధానాన్ని సులభతరం చేసి కార్మికులకు అనువైన మెడికల్ విధా నాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ వహించి, నూతన బొగ్గు గనులను ఏర్పాటు చేయాలన్నారు. 

సింగరేణి సంస్థ పరిరక్షణతో పాటు నూతన బొగ్గు గనులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.  కార్మికులకు ఎప్పటినుంచో కొనసాగుతున్న సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలన్నారు. అయితే సింగరేణి సంస్థలో నూతన బొగ్గు గనులు ఏర్పాటు చేయకపోవడం వల్ల సంస్థ ఉనికికే ప్రమాదం ఏర్పడుతోందన్నారు.

రామవరం, కొత్తగూడెం, బెల్లంపల్లి, రీజియన్ లోని కార్మికుల కుటుంబాలకు రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించా లన్నారు. అనంతరం టీబీజీకేఎస్  అధ్యక్ష, కార్యదర్శులకు మిరియాల రాజిరెడ్డి, కాపు కృష్ణ, ఉపాధ్యక్షులు కోసం వీరభద్ర య్య లకు  నిమ్మరసం ఇచ్చి దీక్ష శిబిరాన్ని విరమింప చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, బిఆర్‌ఎస్ నాయకులు మేకల నాగబాబు, మాజీ కౌన్సిల ర్ అంబుల వేణు, వేముల ప్రసాద్, కరాటే శ్రీనివాస్, ఎండి మజీద్, బొందుగుల  శ్రీధర్, ఎండి హుస్సేన్, సంకు  బాబన్న అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.