12 March, 2026 | 9:57 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

రేపటి బీసీ బంద్‌కి మాలమహానాడు సంపూర్ణ మద్దతు

17-10-2025 10:15 PM

జాతీయ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు గంపల శివకుమార్

ఏటూరునాగారం,(విజయక్రాంతి): తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధన కోసం జరగనున్న బీసీ బంద్‌కు మాలమహానాడు సంస్థ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జాతీయ మాలమహానాడు రాష్ట్రా ఉపఅధ్యక్షుడు గంపల శివకుమార్ మాట్లాడుతూ బీసీలు ఐదు శాతం జనాభా ఉన్న ఓసీలు, పదిహేడు శాతం ఉన్న ఎస్సీలు, తొమ్మిది శాతం ఉన్న ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నా, 52శాతం జనాభా ఉన్న బీసీలకు కేవలం 42శాతం కోటా మాత్రమే ఉండటం అన్యాయమని చెప్పారు. ఈ పరిస్థితిని మార్చేందుకు రేపు జరిగే బంద్‌లో మాలమహానాడు కార్యకర్తలు,జిల్లా నాయకులు విస్తృతంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.