calender_icon.png 18 October, 2025 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనాధ బాలుడికి ఆర్థిక సాయం

18-10-2025 06:52:32 PM

చొప్పదండి (విజయక్రాంతి): ప్రాథమిక పాఠశాల రాగంపేటలో 5వ తరగతిలో చదువుతున్న దీకొండ స్వాద్విన్ తండ్రి అశోక్ అనారోగ్య కారణాలతో మరణించగా తల్లి, నానమ్మ, తాతయ్య ఇది వరకే చనిపోయినందున అనాథగా మారాడు. రాగంపేట జడ్.పి.హెచ్.ఎస్ ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి 12500 రూపాయలను విద్యార్థికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ప్రధానోపాధ్యాయులు దినకర్, ఉపాధ్యాయులు కర్ర వెంకటరాం రెడ్డి, గంగేశం, శ్రీనివాస్, నర్సయ్య, రజియోద్దీన్, రాజకుమార్, యుగేందర్, శంకరయ్య, వీరేశం, తదితరులు పాల్గొన్నారు.