15-06-2025 12:49:22 AM
నిందితున్ని రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ మహేష్..
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) ఎల్లారెడ్డి పట్టణంలోని బస్టాండ్ పక్కనే ఉన్న సత్యం కిరణం దుకాణంలో గోదాంలో అక్రమంగా ప్రవేశించి రాయితో తాళాలు పగలగొట్టి కిరాణం వస్తువులను శుక్రవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. కిరాణా దుకాణం యజమాని ముద్ర కూన సత్యం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా శనివారం ఉదయం 10 గంటలకు ఎల్లారెడ్డి ఎస్ఐకి వచ్చే మహేష్ అంబేద్కర్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అనుమానాస్పదంగా పారిపోతున్న వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా దుకాణంలో దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.
దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి బిక్కనూరు గ్రామానికి చెందిన కోడెనుల రాజు గా గుర్తించి వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ మహేశ్ తెలిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎల్లారెడ్డి ఎస్ఐ మాట్లాడుతూ తరచుగా ఎల్లారెడ్డి పట్టణంలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.