ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
28-03-2026 12:45 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), మార్చి27: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం మండలంలోనీ కొమ్మాల గ్రామంలో శుక్రవారం జరిగింది. కుటుంబ సభ్యులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని కొమ్మాల గ్రామానికి చెందిన కందుకూరి వెంకన్న(42)గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మానసిక ఆందోళన చెంది గ్రామ సమీపంలో ఉన్న చెరువు కట్ట వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.మృతునికి భార్య,ఇద్దరు కుమారులు, కుమార్తె కలదు.మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్త్స్ర సైదులు తెలిపారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.




