17 April, 2026 | 2:30 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

23-10-2025 08:13 AM

ఎల్లారెడ్డి, (విజయక్రాంతి): విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందాడు. ఎల్లారెడ్డి ఎస్ఐ, మహేష్ తెలిపిన వివరాల ప్రకారం, ఎల్లారెడ్డి మండలం లోని మాచాపూర్ గ్రామానికి చెందిన కొండ అమృత రావు, నర్సింగ్ తండ్రి  జీవరత్నం వయసు 48 సంవత్సరాలు. బుధవారం తన వ్యవసాయ భూమిలో అతను, తన భార్య ఇద్దరు పని చేసుకుంటూ ఉండగా అమృత రావ్ మధ్యాహ్నం  2 గంటలకు తన పొలంలోని బోరును ఆన్ చేయడానికి స్టార్ట్ డబ్బును పట్టుకొని బోర్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ వచ్చి కింద పడిపోయి అక్కడికక్కడే మరణించాడని అతని భార్య కొండ సునీత ఫిర్యాదులో తెలిపినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు, చేపట్టినట్లు ఎస్సై తేలిపారు.