15 March, 2026 | 8:41 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల పరిశీలన పూర్తి.. 130 మంది ఔట్

23-10-2025 10:38 AM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నామినేషన్ల(Jubilee Hills by-election) పరిశీలన ప్రక్రియ పూర్తి అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. జూబ్లీహిల్స్ లో 81 మంది అభ్యర్థుల నామినేషన్లకు రిటర్నింగ్ అధికారి (ఆర్‌ఓ) ఆమోదం తెలిపారు. వివిధ కారణాలతో 130 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆర్‌ఓ తిరస్కరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఆర్‌ఓ బుధవారం మూడు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు.

కాంగ్రెస్ అభ్యర్థి వి. నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి. రంగారెడ్డి జిల్లాకు చెందిన 20 మందికి పైగా రైతులు తమ సమస్యలపై నిరసనగా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 24 కాబట్టి, కొంతమంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. అయితే, పోటీలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఉన్నందున మరిన్ని ఈవీఎంలు అవసరమని ఆర్‌ఓ సీఈఓకు తెలియజేశారు.