15-09-2025 12:00:00 AM
చేవెళ్ల, సెప్టెంబర్ 14: బైక్ పై కూరగాయల కోసం వెళ్తుండగా లారీ ఢీకొట్ట డంతో వ్యక్తి మృతి చెందిన. పోలీసుల వివరాల ప్రకారం.. మొయినాబాద్ మం డలం నక్కలపల్లికి చెందిన వడ్డే మల్లేష్ (32) ఆదివారం మధ్యాహ్నం 2.50 గంటలకు కూరగాయల కోసమని ఇం ట్లో చెప్పి బైకుపై చేవెళ్లకు బయలుదేరాడు.
కండవాడ రోడ్డు నుంచి చేవెళ్ల కు టర్న్ తీసుకుంటుండగా షాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు మృతదేహా న్ని పోస్టుమార్టం కోసం చేవెళ్ల ప్రభు త్వా సుపత్రికి తరలించారు. మృతుడి భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.