18 April, 2026 | 10:59 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

రెండు బైక్ లు ఢీకొని వ్యక్తి దుర్మరణం, ఒకరికి గాయాలు

13-05-2025 07:33 PM

కడ్తాల్: రెండు బైక్ లు ఢీకొని ఒకరు దుర్మరణం చెందగా మరొకరు తీవ్ర గాయాలైన సంఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. మంగళవారం సీఐ గంగాధర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గానుగుమర్ల తండాకు చెందిన మునావత్ సోమ్లా నాయక్(38) పల్సర్ బైక్ పై తండా నుంచి కడ్తాల్ వస్తుండగా మల్లప్ప ఫోల్ట్రీఫామ్ వద్ద కడ్తాల్ నుంచి గానుగుమర్ల తండాకు మరో వ్యక్తి పల్సర్ బైక్ పై వెళుతుండగా రెండు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సోమ్లా నాయక్ తీవ్ర గాయాలు కాగా 108లో మహేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమ్లా నాయక్ మృతి చెందాడు. మరో బైక్ అతను గాయాలయ్యాయి. మృతుని తమ్ముడు పాండు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.