30 August, 2026 | 8:59 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

పాలీసెట్‌కు 92.64 శాతం హాజరు

13-05-2025 11:53 PM

హైదరాబాద్ (విజయక్రాంతి): ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలీసెట్ (Polytechnic Common Entrance Test) మంగళవారం ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 92.64 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. 276 పరీక్ష కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. బాలురు 57,178 మంది, బాలికలు 49,538 మంది దరఖాస్తు చేసుకోగా, బాలురు 53,086 మంది, బాలికలు 45,772 మంది హాజరయ్యారు. బాలురు 92.84 శాతం, బాలికలు 92.4 శాతంతో మొత్తంగా 92.64 శాతం మంది పరీక్ష రాశారు. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కార్యదర్శి ఏ పుల్లయ్య తెలిపారు.