15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ముగిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

13-05-2025 10:54 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరుగుచున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరిరోజైనా మంగళవారం ఉదయం సేవా కాలం మూలమంత్ర హవనం, మహా పూర్ణాహుతి, బలిహరణ, మహా కుంభ ప్రోక్షణ, చక్రతీర్థోత్సవం, మధ్యాహ్నం శ్రీ పుష్పయాగం, దేవతో ద్వాసనం, ద్వాదశరాధన, సప్తావరణం, ధ్వజావరోహణం, రుత్విక్ సన్మానం, తీర్థ ప్రసాద వితరణ అనంతరం మేళతాళాలతో స్వామివారిని ఊరేగింపుగా గ్రామ దేవాలయమునకు రథంలో తీసుకువెళ్లడం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కమలాకర్ రెడ్డి, ఈవో శ్రీధర్ రావు, వేద పండితులు, ఆలయ అర్చకులు, ఆలయ డైరెక్టర్లు, ఆలయ సిబ్బంది, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.