విద్యుత్తు షాక్ తగిలి వ్యక్తి మృతి
06-08-2026 04:26 PM
తూప్రాన్,(విజయక్రాంతి): గురువారం తూప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామం ఒక వ్యవసాయ పొలం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, నర్సంపల్లి గ్రామస్తుడు జింక నాగార్జున 28, అనే వ్యక్తి పొలం వద్ద నేలపై పడివున్న విద్యుత్ వైరును కరెంటు లేదని భావించి పక్కకు తొలగించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తూప్రాన్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నమని ఎస్సై గంగరాజు తెలిపారు.






