10 April, 2026 | 7:24 PM

Breaking News

దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర మహాసభలు   •   మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన హాఫీజుద్దీన్   •   ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వ భరోసా : మంత్రి పొంగులేటి   •   నిఘా నేత్రల ఏర్పాటులో భాగస్వామ్యులు కావాలి   •   గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల సాధించే వరకు పోరాటం ఆగదు   •   షార్ట్ సర్క్యూట్‌తో వీదినపడ్డ నిరుపేద కుటుంబం   •   క్యాంటీన్‌లో మిల్లెట్స్ వంటకాలు అందుబాటులోకి తేవాలి   •   ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అభినందించిన ఎమ్మెల్యే   •   ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగం కోసం సిపిఐ పోరాటం...   •  

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

12-11-2025 12:00 AM

నస్కల్ గ్రామంలో విషాదం

రామాయంపేట, నవంబర్ 11 : రామాయంపేట ఉమ్మడి మండలంలోని నస్కల్ గ్రామానికి చెందిన బక్కన్నగారి లాలాగౌడ్ (53) కరెంట్ షాక్ తగిలి మృత్యువాత పడ్డాడు. రామాయంపేట పట్టణంలోని మెదక్ రోడ్ వద్ద ఆయన నడుపుతున్నహోటల్ సమీపంలో ఈ విషాదం చోటుచేసుకుంది. లాలాగౌడ్ హోటల్ పక్కన ఉన్నషెడ్కు ఆనుకుని ఉన్న సపోర్ట్ స్టాండ్ను పట్టుకోగా అకస్మాత్తుగా కరెంట్ షాక్ తగిలింది.

దాంతో లాలాగౌడ్ కుప్పకూలగా, వెంటనే అక్కడే ఉన్న వినయ్ తన మెడలోని టవల్తో ఆయనను పైకి లాగాడు. అయితే అప్పటికే లాలాగౌడ్ మృతి చెందినట్లు తేలింది. ఈ ఘటన సమయంలో ఇద్దరూ హనుమాన్ మాలలు ధరించి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.