calender_icon.png 19 October, 2025 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి అడ్లూరికి ఘన స్వాగతం పలికిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల

19-10-2025 04:37:38 PM

మంథని (విజయక్రాంతి): మంథని నియోజకవర్గంలోని రామగిరి మండలం రామయ్య పల్లి గ్రామానికి వస్తున్న రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు ఆదివారం మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ నాగపల్లి ఎక్స్ రోడ్ పెట్రోల్ బంక్ వద్ద కలిసి శాలువాతో సత్కరించి, ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంథని నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.