23-06-2025 06:48:30 PM
నిర్మల్ (విజయక్రాంతి): మాదకద్రవ్యాలు వాడడం వల్ల ప్రజలకు అనేక అనర్థాలు జరుగుతున్నాయని దాని నిర్మూలనకు ప్రజలందరూ కూడా కృషి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్(Additional Collector Faizan Ahmed) అన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని ఆశ్రమ గిరిజన పాఠశాలలో మాదకద్రవ్యాల నియంత్రణపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ వారి యొక్క అమూల్యమైన జీవితంపైన దృష్టి పెట్టాలని చెప్పడం జరిగింది.
విద్యార్థులు అన్ని రకాల మత్తు మందులకు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, బాగా చదువుకొని మంచి భవిష్యత్ ఏర్పరుచుకొని, శక్తివంతమైన భారతదేశాని నిర్మించడములో భాగ్యస్వామ్యూలు అవ్వాలని పిలుపునిచ్చారు. అలాగే గత పదవ తరగతి ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించినందుకు పిల్లలకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అలాగే కార్యక్రమంలో భాగంగా చెట్లు నాటడం జరిగింది. కార్యక్రమానికి అతిదిలుగా విచ్చేసిన ACMO- శివాజీ, ప్రిన్సిపల్ తుకారాం, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, CDPO నాగమణి, సరిత, ఉపాధ్యాయులు బి గజ్జరం, నాందేవ్ ఇతర పాఠశాల, డిపార్ట్మెంట్ సిబ్బంది విద్యార్థి విద్యార్థినులు పాల్గొన్నారు.