13 April, 2026 | 11:52 AM

Breaking News

మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో ఘోర రోడ్డుప్రమాదం: ట్రక్కు ఢీకొని ఏడుగురు దుర్మరణం   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •   రెడ్డిపల్లి కార్బన్ రిసోర్సస్ సంస్థ వివాదం – హైకోర్టు ఆదేశాలు, అధికారుల అడ్డంకులు   •  

మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉయికే హతం

25-12-2025 02:32 PM

భువనేశ్వర్: ఒడిశాలో ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. కంధమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత గణేశ్ ఉయికే మృతి చెందాడు. మృతి చెందిన మావోయిస్టు గణేశ్ ఉయికే నల్గొండ జిల్లా పుల్లేంల వాసిగా గుర్తించారు. గణేశ్ ఉయికే సీపీఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. గణేశ్ ఒడిశాలో మావోయిస్టు కార్యకలాపాలకు కీలక బాధ్యతలు స్వీకరించారు. గణేశ్ సుమారు 40 ఏళ్లు మావోయిస్టు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు.

అటవీ ప్రాంతంలో మావోయిస్టు బలాన్ని పెంచడంలో గణేశ్ దే కీలక పాత్ర. భద్రతా బలగాలపై దాడుల ప్రణాళికలో గణేశ్ ప్రధాన పాత్ర నిర్వహించినట్లు గుర్తించారు. గణేశ్ ఉయికేపై రూ. 1.10 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఒడిశా, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం సీఆర్పీఎఫ్ బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశాల నుండి రైఫిళ్లు, ఒక 303 రైఫిల్, ఒక రివాల్వర్, కమ్యూనికేషన్ పరికరాలతో సహా ఆయుధాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పొరుగున ఉన్న మల్కన్‌గిరి జిల్లాలో ఒడిశా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముందు 22 మంది మావోయిస్టులు లొంగిపోయిన కొన్ని రోజుల తర్వాత ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.