calender_icon.png 22 November, 2025 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్కపల్లిలో గంజాయి సాగు!

22-11-2025 12:37:06 AM

-పెరటి తోట మాదిరి మొక్కల పెంపకం 

-విత్తనాలు నాటిన యువకుడు  

-సీఎం సొంత ప్రాంతంలో కలకలం

-మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ 

నాగర్ కర్నూల్, నవంబర్ 21 ( విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సొంత ప్రాంతంలో గంజాయి సాగు కలకలం రేపిం ది. అచ్చంపేట మండలం పల్కపల్లిలో గ్రా మానికి చెందిన నాగనులు మధు గంజాయి పెరటి సాగు చేస్తున్నాడు. ఆ యువకుడు గంజాయికి బానిసై మార్కెట్‌లో అధిక ధరలకు గకొనలేక, హైదరాబాద్ లాంటి ప్రాం తాల్లో గంజాయి విత్తనాలను కొనుగోలు చేసి తన సొంత ఇంటి పెరట్లోనే మొక్కలు పెంచుతున్నాడు. తాను వినియోగించడంతోపాటు ఇతరులకు కూడా గంజాయి విక్ర యించేవాడు.

ఈ తంతు గత రెండేళ్లుగా జరుగుతున్నప్పటికీ ఎక్సైజ్, పోలీస్ శాఖలు గుర్తించలేకపోయాయి. గురువారం రాత్రి కచ్చితమైన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి తనిఖీ చేయగా నాగనూలు మధు తన పెరటిలో సుమారు 18 గంజాయి మొక్కలను గుర్తించారు. ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యంతోనే నాగర్ కర్నూల్ జిల్లాలో గంజా యి, ఆల్ఫాజూలం విక్రయాలు బాహాటంగా జరుగుతున్నాయని సామాన్యులు  విమర్శిస్తున్నారు. నిత్యం కల్లు, మద్యం, బెల్టు దుకా ణాల నుంచి వచ్చే ముడుపులను లెక్కబెట్టుకోవడంలోనే బిజీగా ఉన్నారని సామాన్యు లు మండిపడుతున్నారు.

సుమారు రెండేళ్లుగా పెరటి మొక్కల మాదిరి గంజాయి సాగు చేస్తున్నా ఎక్సైజ్ శాఖ తెలియకపోతుం దా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితమైన సమాచారంతో అచ్చంపేట ఎస్‌ఐ సద్దాం హుస్సేన్, మరో ఎస్‌ఐ సుధీర్ కు మార్, పోలీస్ కానిస్టేబుళ్లు మహేష్, మల్లేష్, వెంకట్ నాయక్, పంచాయతీ సెక్రెటరీ బాలరాజు, రెవెన్యూ సిబ్బంది బృందం దాడులు చేసి ఐదు కిలోల బరువు గల 18 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.