calender_icon.png 7 July, 2025 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లిలో రైల్వే నిర్మాణ పనులను త్వరితంగా పూర్తి చేయాలి

07-07-2025 05:01:35 PM

రైల్వే నిర్మాణ పనులను జీఎం సందీప్ పార్డు పరిశీలన..

పలు ఎక్స్ ప్రెస్ రైళ్ల హాల్టికింగ్ వినతులు..

రైల్వే స్టేషన్ సందర్శించిన జీఎం సందీప్ మాథుర్..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో జరుగుతోన్న అభివృద్ధి పనులను దక్షిణ మధ్య రైల్వే జీఎం సందీప్ మాథుర్(South Central Railway GM Sandeep Mathur) సోమవారం పరిశీలించారు. ప్రత్యేక రైల్లో ఆయన బెల్లంపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. మూడో లైన్ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రైల్వే ట్రాక్, ప్లాట్ ఫామ్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. నిర్మాణ అభివృద్ధి పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని రైల్వే జీఎం ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. రైల్వే స్టేషన్లో జరుగుతున్న అన్ని రకాల నిర్మాణ పనులను ఆయన నిశితంగా తనిఖీ చేశారు.

రైల్వే స్టేషన్లో నూతనంగా నిర్వహిస్తున్న ఫ్లాట్ ఫామ్ తో పాటు ట్రాక్ నిర్మాణ పనుల నాణ్యతను ప్రత్యేకంగా తనిఖీ చేశారు. వేగంగా నిర్దేశించిన నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సంబంధిత అధికారులకు ప్రత్యేకంగా చెప్పారు. ఇప్పటివరకు రైల్వే స్టేషన్లో మూడో రైల్వే ట్రాక్, మూడో ఫ్లాట్ ఫామ్ నిర్మాణ పనుల పురోగతి పై జీఎం అధికారులతో చర్చించారు. ఆయా విభాగాల రైల్వే అధికారులు జీఎంకు నిర్మాణ అభివృద్ధి పనుల గురించి సమగ్రంగా వివరించారు. 

ఎక్స్ ప్రెస్ రైళ్ల హాల్టింగ్ కోసం జీఎం కు సీపీఐ నాయకుల వినతి..

బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ల్లో అభివృద్ధి నిర్మాణ పనులను పరిశీలించడానికి వచ్చిన రైల్వే జీఎం సందీప్ మాథుర్ ను సీపీఐ నాయకుల ప్రతినిధుల బృందం కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు బెల్లంపల్లిలో నవజీవన్, అప్ జీ టీ ఎక్స్ ప్రెస్ రైళ్ళను ఆపాలని సీపీఐ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. రాంనగర్ రైల్వే బ్రిడ్జి కింద నుంచి రహదారికి అనుమతి ఇవ్వాలని కోరారు, ఈ మేరకు ఆయనకు పలు డిమాండ్ల వినతి పత్రం అందజేశారు. రైల్వే జీఎం కలిసి వినతిపత్రం అందజేసిన వారిలో సీపీఐ పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, సీనియర్ నాయకులు చిప్ప నరసయ్య, సీపీఐ నాయకులు బొల్లం తిలక్ అంబేద్కర్, రత్నం రాజం తదితరులు ఉన్నారు.