5 March, 2026 | 5:19 PM

Breaking News

నిబద్ధత కలిగిన మార్సిస్టు కార్యకర్త కామ్రేడ్ సింగపంగా ముత్తమ్మ   •   సైనిక స్కూల్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాల్లో... క్రాంతి కీన్ అకాడమీ సత్తా.   •   కరెంట్ తగిలి రైతుమృతి   •   రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   •   మాచన రఘునందన్‌కు డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు   •   ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకున్న కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్   •   సిఎస్ఆర్ నిధులను నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి వెచ్చించాలి   •   ఆర్ట్స్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం   •   శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి   •   పరీక్షలు అంటే భయం వీడాలి   •  

ఉరి వేసుకుని వివాహిత బలవన్మరణం

03-12-2025 10:48 PM

చిట్యాల (విజయక్రాంతి): చిట్యాల మండలం, ఏపూర్ గ్రామానికి చెందిన మందుల లక్ష్మమ్మ(40) వివాహిత కడుపునొప్పి భరించలేక బలవన్మరణానికి పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఏపూర్ గ్రామానికి చెందిన మందుల నరసింహ భార్య అయిన లక్ష్మమ్మ గత కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ వైద్యులచే చికిత్స తీసుకుంటుంది. అయినప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి పైకప్పుకు చీరతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.