1 July, 2026 | 6:40 PM

Breaking News

బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •  

హనుమాన్ జయంతి ఉత్సవాలకు భారీ బందోబస్తు

10-04-2025 12:28 AM
  1. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు

రూట్ మ్యాప్‌లను పరిశీలించిన కమిషనర్, పోలీసులు

ఎల్బీనగర్, ఏప్రిల్ 9 : త్వరలో జరుగనున్న హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఎటువంటి శాంతి భద్రతల స మస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసులను రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశిం చారు. బుధవారం రాత్రి కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం, కొత్తపేట, చంపాపేట్, సిం గరేణి కాలనీ, సరూర్ నగర్ లోని ట్యాంక్ బండ్ పోస్ట్ ఆఫీస్, గాంధీ విగ్రహం, దిల్ సుఖ్ నగర్, సరస్వతి నగర్ తదితర ప్రాంతా ల్లో హనుమాన్ జయంతి ఉత్సవాల రూట్ మ్యాప్ లను స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలీసు అధి కారులకు కమిషనర్ పలు సూచనలు చేశారు. రాచకొండ పరిధిలోని సున్నితమైన ప్రదేశాల్లో ఉత్సవాల నిర్వహణలో తగిన జాగ్రత్త లు తీసుకోవాలని, శాంతియుతంగా ఊరేగింపులు జరిగేలా చూడాలని, భక్తులతో, ఉత్సవ కమిటీ సభ్యులతో సమన్వ యంతో వ్యవహరించాలని సూచించారు. మతసామరస్యానికి భంగం కలిగించే చర్యలను పోలిసు శాఖ ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు.

భక్తులు, ప్రజలు సంతోషంగా, శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలని, పోలీసు లకు సహకరించాలని కమిషనర్ కోరారు.  కమిషనర్  వెంట ఎల్బీనగర్ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, డీసీపీ స్పెషల్ బ్రాంచ్ నర్సింహా రెడ్డి, డీసీపీ ట్రాఫిక్-2 శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.