28-06-2025 12:50:14 AM
- రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్
రాజేంద్రనగర్, జూన్ 27: దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన సర్కిల్ పరిధిలోని బన్సీలాల్ నగర్ లో దోమల నివారణ ఫాగింగ్ కు సంబంధించి రికార్డులను తనిఖీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. దోమల నివారణకు సర్కిల్ పరిధిలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. అన్ని కాలనీల్లో ఫాగింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాస్త్రిపురం వార్డుకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. వాకింగ్ విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని సిబ్బందికి డిప్యూటీ కమిషనర్ రవికుమార్సూచించారు.