calender_icon.png 28 June, 2025 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూముల జోలికొస్తే ఊరుకోం

28-06-2025 12:49:06 AM

  --మొయినాబాద్ తహసీల్దార్ కె. గౌతమ్ కుమార్

చేవెళ్ల, జూన్ 27: ప్రభుత్వ భూముల జోలికొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్ కుమా ర్ హెచ్చరించారు. శుక్రవారం మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని అజీజ్ నగర్ లో హైదరాబాద్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న సర్వే నెం 177 లోని 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన ప్రహరీని కూల్చివేయించారు.

తహసీల్దార్ ఆదేశాల మేరకు మండల గిర్దవర్ రాజేష్ నేతృత్వంలో రెవెన్యూ సిబ్బంది పోలీసుల సహకారంతో జేసీబీ సాయంతో తొలగించారు. అనంతరం పక్కనే ఉన్న మరో 2 ఎకరాలు కలిపి ప్సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. తహసీల్దార్ కె. గౌతమ్ కుమార్ మాట్లాడుతూ భూకబ్జాదారులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహారిస్తోందని, త్వరలోనే ప్ర భుత్వభూముల రక్షణకు ఫెన్సింగ్ , సూచిక బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లుతెలిపారు.