calender_icon.png 28 June, 2025 | 3:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లిదండ్రులను బిడ్డలు చంపేలా మారిన సమాజం

28-06-2025 12:50:26 AM

తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొ. జి.హరగోపాల్

ముషీరాబాద్, జూన్ 27 (విజయ క్రాంతి): చదువులు ప్రైవేట్, కార్పొరేట్ అయ్యాక మానవ విలువలు మృగ్యం అయ్యాయని పౌర హక్కుల నేత, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటి ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నారు. దీనికి ప్రభుత్వాలు అడ్డుకట్ట వేయకపోగా, వారే ద్వారాలు తెరిచాయని మండి పడ్డారు. సమాజం విషతుల్యం అయిందని, తమ బిడ్డలను, తల్లి తండ్రులు, తల్లి తండ్రులను బిడ్డలు చంపుతున్న సమాజం తయారయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

శుక్రవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కార్యనిర్వాహక కార్యదర్శి డి.నరసింహ రెడ్డి అధ్యక్షతన నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా హరగోపాల్ మాట్లా డుతూ ఇలాంటివి చదివిన వారు కూడా చేస్తున్న దుస్థితి నెలకొందని అన్నారు. సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కెజి.రాం చందర్ మాట్లాడుతూ విద్యా రంగంలో ఒకప్పుడు ప్రైవేట్ వైద్యం లేదన్నారు.

ధనికులు, పేదల పిల్లలు ఒకే పాఠశాలలో చదివే పరిస్థితి ఉందన్నారు. దీనితో పిల్లలో సౌభ్రాతృ త్వం ఏర్పడేదని అన్నారు. మానవ విలువలు, స్నేహాలు ఏర్పడేవి, కానీ పాలకులు కావాలనే ప్రభుత్వ విద్యను ధ్వంసం చేసి, ధనికులకు ఒక విద్య, పేదలకు మరో విద్య అందేలా చేశారని మండిపడ్డారు. విద్యా రంగానికి రాష్ట్రంలో 30శాతం, కేంద్రంలో 10 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేయాలన్నారు.